Breaking News

ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

తెనాలి ఏప్రిల్ 14 (నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్ సంస్కరణలకు ఆద్యుడనిపలువురువక్తలు కొనియాడారు. మంగళవారం గాంధీనగర్ ఇస్కఫ్ కార్యాలయం డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్ 135 జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వక్తలుమాట్లాడుతూ అంబేద్కర్ బడుగు, బలహీనవర్గాలు, దళితుల సంక్షేమం కోసం పోరాడిన యోధుడని పేర్కొన్నారు. అంటరానితనంకు, కులవివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేయడమే కాకుండా బడుగుల హక్కుల కోసం జీవితాంతం పోరాటం చేసిన మహొన్నత వ్యక్తి అంబేద్కర్ అని వాఖ్యనించారు. పోటీతత్వంతో ఉన్నత చదువులు చదివి ప్రపంచంలోనే అత్యధికంగా డిగ్రీలు సాధించి ప్రపంచంలోనే అత్యంత తెలివైన జ్ఞానిగా పేరు గాంచారని కొనియాడారు. ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ను స్పూర్తిగా తీసుకోని నడవాలని సూచించారు.ఈ కార్యక్రమంలోసాయిమంగావెల్ఫేర్ సొసైటీ ఆధ్యక్షులు కంకిపాటిరమేష్ కుమార్,బొల్లిముంత కృష్టమాస్టర్,సి.హెచ్.శ్రీదేవి,ఓతుకోలు మార్కండేయులు,బొమ్ము రామకృష్టారెడ్డి,తుంగా బాలస్వామి,యస్.కె.జియాతదితరులు పొల్గొన్నారు.

అంబటి అనుదీప్ హత్య కేసులో వేగవంతమైన విచారణకు డిమాండ్: రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షుడు చందు జనార్దన్

పవన్ కల్యాణ్‌పై వ్యాఖ్యలు.. ఇద్దరు కమెడియన్లపై పోలీసుల చర్యలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *