Breaking News

అంబేద్కర్ జయంతి ని పురస్కరించుకుని గ్రామ సభ

పామర్రు, ఏప్రిల్ 14(నేటి తెలుగు పత్రిక ): నియోజకవర్గం కేంద్రమైన పామర్రు పట్టణంలోని ఒకటవ గ్రామ సచివాలయం నందు మంగళవారం అంబేద్కర్ జయంతి సందర్భంగా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి బి రామారావు ఆధ్వర్యంలో సచివాలయం అవరణం నందు గ్రామ సభ ను నిర్వహించడం జరిగింది.
గ్రామ ప్రజల నుంచి వచ్చిన అభివృద్ధి కార్యక్రమాలపై అర్జీలను ప్రత్యేక అధికారి రామారావు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గం ఇన్చార్జి తాడిశెట్టి నరేష్, పంచాయతీ కార్యదర్శి అబ్దుల్ సలీం సచివాలయం పంచాయతీ కార్యదర్శలు నెరుసు నరేష్,ఆరేపల్లి తిరుమల, పెనుమాల ఉమా ప్రతాప్, బోసు,సచివాలయం సిబ్బంది, సచివాలయ మహిళా పోలీసులుఇతర సిబ్బంది, గ్రామ పంచాయతీ సిబ్బంది, కూటమి పార్టీ నేతలు తో పాటు సిపిఎం నాయకులు, అంగన్వాడీ కార్యకర్తలు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

అంబటి అనుదీప్ హత్య కేసులో వేగవంతమైన విచారణకు డిమాండ్: రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షుడు చందు జనార్దన్

పవన్ కల్యాణ్‌పై వ్యాఖ్యలు.. ఇద్దరు కమెడియన్లపై పోలీసుల చర్యలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *