ఏప్రిల్ 14, నేటి తెలుగు పత్రిక: అమలాపురం నియోజకవర్గం ఉప్పలగుప్తం ప్రాంతానికి చెందిన వీరమహిళ చిక్కం సుధారాణిను అగ్రికల్చరల్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఏజెన్సీ (ఆత్మ) కమిటీ చైర్మన్గా నియమించడం పట్ల స్థానికంగా హర్షం వ్యక్తమవుతోంది. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి చురుకుగా పనిచేస్తూ, తనదైన శైలిలో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఆమె గుర్తింపు పొందారు. పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన కార్యకర్తగా ఆమె సేవలను గుర్తించినట్లు సమాచారం.ఈ నియామకంతో ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీ నాయకత్వానికి, ముఖ్యంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు స్థానిక నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు పొందాలని, ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని స్థానికులు ఆకాంక్షించారు.
