ఏప్రిల్ 14, నేటి తెలుగు పత్రిక: ఆనంద్ బాగ్ చౌరస్తాలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమం సందర్భంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన అంబేద్కర్ ఆశయాలను స్మరించుకుంటూ, భారత రాజ్యాంగ రూపకర్తగా దేశానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. సమానత్వం, న్యాయం, సామాజిక సమగ్రత కోసం అంబేద్కర్ చేసిన పోరాటం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని తెలిపారు.అంబేద్కర్ చూపిన మార్గం నేటి సమాజానికి మార్గదర్శకమని రాంచందర్ రావు అభిప్రాయపడ్డారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో వినాయక్ నగర్ మాజీ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మీ, బీజేపీ సీనియర్ నాయకులు వడ్డే సుబ్బారావు, వాసంశెట్టి శ్రీనివాస్, ఉడుతా నవీన్ తదితరులు పాల్గొన్నారు.
