ఏప్రిల్ 14, నేటి తెలుగు పత్రిక: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జె. పి. నడ్డా నేతృత్వంలో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. ఈ కార్యక్రమంలో కె. అన్నామలై, తమిళిసై సౌందరరాజన్, నాగేంద్రన్ సహా పలువురు నాయకులు పాల్గొన్నారు. మేనిఫెస్టోలో భాగంగా ప్రతి ఇంటికి ఒకేసారి రూ.10,000 ఆర్థిక సాయం అందించనున్నట్లు బీజేపీ ప్రకటించింది. అలాగే మహిళలకు నెలకు రూ.2,000 ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చింది.అంతేకాకుండా పొంగల్, దీపావళి, తమిళ నూతన సంవత్సర పండుగల సందర్భంగా ఉచితంగా ఎల్పీజీ సిలిండర్లు అందించనున్నట్లు తెలిపింది. పీఎం కిసాన్ పథకానికి అదనంగా ఏటా రూ.3,000 ఇవ్వనున్నట్లు కూడా మేనిఫెస్టోలో పేర్కొంది.ఈ హామీలతో ప్రజలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యమని బీజేపీ నేతలు తెలిపారు.
