Breaking News

కీసరలో అంబేద్కర్ జయంతి వేడుకలు.. విగ్రహానికి ఎంపీ ఈటల రాజేందర్ ఘన నివాళి

ఏప్రిల్ 14, నేటి తెలుగు పత్రిక: కీసరలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఘనంగా నివాళి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ అంబేద్కర్ దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. కులం, మతం, పార్టీలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిన మహనీయుడు అంబేద్కర్ అని తెలిపారు.సమాజంలో సమానత్వం, న్యాయం సాధించేందుకు అంబేద్కర్ చేసిన కృషి చిరస్మరణీయమని ఆయన పేర్కొన్నారు. భారత రాజ్యాంగ రూపకల్పన ద్వారా ప్రతి పౌరుడికి సమాన హక్కులు లభించాయని చెప్పారు.అంబేద్కర్‌ను ఒక వర్గానికి పరిమితం చేసే ప్రయత్నాలు జరిగాయని, కానీ ఆయన జీవితాంతం అణగారిన వర్గాల కోసం పోరాడిన నాయకుడని ఈటల రాజేందర్ అన్నారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు.

మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఆనందం.. ఈటెలకు కార్పొరేటర్ల కృతజ్ఞతలు

అంబేద్కర్ సేవలు దేశ అభివృద్ధికి మార్గదర్శకమని, ఆయన చూపిన మార్గం నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు.

స్టాండప్ కామెడీ వివాదం.. అనుదీప్ కటికలపై చర్యలకు ఆదేశాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *