Breaking News

సచివాలయం వద్ద 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలి.. కేటీఆర్, వద్దిరాజు రవిచంద్ర సహా బీఆర్ఎస్ నేతల నివాళులు

ఏప్రిల్ 14, నేటి తెలుగు పత్రిక: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా సచివాలయం సమీపంలోని 125 అడుగుల భారీ కాంస్య విగ్రహానికి బీఆర్ఎస్ నేతలు ఘనంగా నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. టి. రామారావు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, వీ. శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ మాజీ విప్ బాల్క సుమన్ తదితరులు పాల్గొన్నారు.నేతలందరూ కలిసి అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు అంబేద్కర్ సేవలను స్మరించుకున్నారు. రాజ్యాంగ రూపకర్తగా, సామాజిక విప్లవకారుడిగా, సంఘ సంస్కర్తగా ఆయన చేసిన కృషి దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి, గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఆర్.వి. మహేందర్, గజ్జెల నగేష్ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *