Breaking News

డీలిమిటేషన్ బిల్లుతో దేశ రాజకీయాల్లో ఉద్రిక్తత.. ఇండియా కూటమి కీలక సమావేశం

ఏప్రిల్ 14, నేటి తెలుగు పత్రిక: దేశవ్యాప్తంగా లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఏప్రిల్ 16న పార్లమెంట్‌లో డీలిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించడంతో అన్ని పార్టీల్లో చర్చలు ప్రారంభమయ్యాయి.ఈ నిర్ణయంతో అప్రమత్తమైన ప్రతిపక్షాల ‘ఇండియా’ కూటమి తమ తదుపరి కార్యాచరణపై దృష్టి సారించింది. ఈ బిల్లుపై చర్చించేందుకు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో ఏప్రిల్ 15న కీలక సమావేశం నిర్వహించనున్నారు. కేంద్రం ప్రతిపాదనలకు ఎలా ప్రతిస్పందించాలి, రాష్ట్రాలపై ప్రభావం ఎలా ఉంటుందన్న అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.కేంద్రం ప్రతిపాదించిన 131వ రాజ్యాంగ సవరణ ద్వారా లోక్‌సభ స్థానాల సంఖ్యను పెంచే యోచనలో ఉంది. ప్రస్తుతం ఉన్న 543 స్థానాలను సుమారు 850కి పెంచే ప్రణాళిక ఉంది. ఇందులో రాష్ట్రాలకు 815 స్థానాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 35 స్థానాలు కేటాయించే అవకాశం ఉందని సమాచారం.ఈ పునర్విభజనపై దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. జనాభా ప్రాతిపదికన జరిగే ఈ ప్రక్రియ వల్ల తమ ప్రాతినిధ్యం తగ్గుతుందనే భయం వ్యక్తమవుతోంది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం. కె. స్టాలిన్ ఈ బిల్లుపై తీవ్రంగా స్పందిస్తూ, అమలు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలో ఇండియా కూటమి సమావేశం అత్యంత కీలకంగా మారింది. ఈ బిల్లును పూర్తిగా వ్యతిరేకించాలా లేదా సవరణలు కోరాలా అన్న విషయంపై కూటమి నేతలు నిర్ణయం తీసుకోనున్నారు.

నియోజకవర్గాల పునర్విభజనపై రాజకీయ రగడ.. కేంద్ర-దక్షిణ రాష్ట్రాల మధ్య విభేదాలు ముదురుతున్నాయి

ఢిల్లీ‌లో ఇండియా కూటమి కీలక సమావేశం ముగింపు.. డీలిమిటేషన్‌పై వ్యతిరేకత, మహిళా రిజర్వేషన్‌కు మద్దతు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *