Breaking News

డీలిమిటేషన్‌పై కిషన్ రెడ్డి వ్యాఖ్యలు.. అన్యాయం ఉండదని స్పష్టం

ఏప్రిల్ 14, నేటి తెలుగు పత్రిక: డీలిమిటేషన్ ప్రక్రియపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రక్రియ వల్ల దేశంలోని ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగదని ఆయన స్పష్టం చేశారు.రాజ్యాంగ సవరణకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే లక్ష్యమని తెలిపారు. ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ స్థానాలను 850కి పెంచే ప్రతిపాదనను కేంద్రం పరిశీలిస్తున్నదని చెప్పారు.ఈ ప్రణాళిక ప్రకారం రాష్ట్రాలకు 815 ఎంపీ స్థానాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 35 స్థానాలు కేటాయించేలా ఆలోచన చేస్తున్నామని వివరించారు. జనాభా ఆధారంగా సమాన ప్రాతినిధ్యం కల్పించడం ద్వారా ప్రజలకు మరింత న్యాయం జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.డీలిమిటేషన్‌ను వ్యతిరేకించడం సరైనది కాదని, ఇది దేశ అభివృద్ధికి అవసరమైన కీలక ప్రక్రియ అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

పీర్జాదీగూడలో రాజకీయ మార్పులు.. బీఆర్‌ఎస్‌లో చేరిన కౌన్సిలర్లు

మానవ హక్కులు, బాండెడ్ కార్మిక వ్యవస్థపై వర్క్‌షాప్.. సీతక్కకు ఆహ్వానం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *