|| Deputy Chief Minister who initiated the Amandaramis Project ||
సుస్థిరమైన నీటి వనరుల వినియోగంతో రాష్ట్రవ్యాప్తంగా జల్ జీవన్ మిషన్ విజయవంతంగా అమలు చేయడం కోసం, గ్రామీణ నీటిసరఫరా మరియు పారిశుధ్య విభాగం ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి వర్క్ షాప్ విజయవాడలోని లెమెన్ ట్రీ హోటల్లో జరిగింది. ఈ వర్క్ షాప్లో ఉప ముఖ్యమంత్రి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొని అమృతధార ప్రాజెక్ట్ను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు శ్రీ పిడుగు హరిప్రసాద్, పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ శశిభూషన్ కుమార్ ఐఏఎస్, పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ శ్రీ కృష్ణతేజ ఐఏఎస్, RWS & S ఇంజనీర్ ఇన్ చీఫ్ శ్రీ సంజీవ్ రెడ్డి, RWS & S ఇంజనీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వరరావు, RWS & S చీఫ్ ఇంజనీర్ శ్రీ హరే రామ్ నాయక్ మరియు రాష్ట్రంలోని 36 జిల్లాలకు సంబంధించిన గ్రామీణ నీటి సరఫరా & పారిశుధ్య విభాగం అధికారులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం ద్వారా, నీటి సరఫరా వ్యవస్థలను మరింత మెరుగుపరచడంపై చర్చలు జరిగాయి.
