ఏప్రిల్ 15, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతి పేరుపై కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. ఇకపై రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అన్ని అధికారిక పత్రాలు, నోట్లు, లేఖాచారాల్లో ‘అమరావతి’ అనే పేరునే తప్పనిసరిగా ఉపయోగించాలని ఆదేశించిందిఈ నిర్ణయాన్ని అమలు చేయాలని రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు సూచనలు పంపింది. అన్ని ప్రభుత్వ శాఖలు ఒకే విధమైన పేరును ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.ఇంగ్లీష్లో అమరావతి పేరును రాయడంలో కూడా మార్పు చేసింది. ఇంతవరకు వాడుతున్న ‘Amaravathi’ బదులుగా ఇకపై ‘Amaravati’ అనే స్పెల్లింగ్ను మాత్రమే ఉపయోగించాలని ప్రభుత్వం ఆదేశించింది.అధికారిక రికార్డుల్లో ఏకరీతి, స్పష్టత ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అన్ని శాఖలు ఈ ఆదేశాలను కచ్చితంగా పాటించాలని సూచించింది.
