Breaking News

చార్మినార్‌లో నగల మాయం.. భద్రతపై ఆందోళన

ఏప్రిల్ 15, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్‌లోని చార్మినార్ పరిసర ప్రాంతంలో జరిగిన బంగారం చోరీ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఎప్పుడూ సందర్శకులతో కిటకిటలాడే ఈ ప్రాంతంలో భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.ఈ నెల 12వ తేదీ సాయంత్రం ఓ మహిళ తన కుమార్తెతో కలిసి బంగారు ఆభరణాలు పాలిష్ చేయించేందుకు గుల్జార్ హౌస్ ప్రాంతానికి వెళ్లింది. ఒక దుకాణంలో ధర ఎక్కువగా ఉండడంతో, ఆభరణాలను తిరిగి పర్స్‌లో పెట్టుకుని మరో షాపుకు వెళ్లింది. అయితే అక్కడికి చేరుకున్న తర్వాత పర్స్‌లో నగలు కనిపించకపోవడంతో ఆమె షాక్‌కు గురైంది.దాదాపు నాలుగు తులాల బంగారు నగలు మాయమైనట్లు గుర్తించిన బాధితురాలు వెంటనే పోలీసులను ఆశ్రయించింది. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే సీసీటీవీ ఫుటేజ్ స్పష్టంగా లేకపోవడం విచారణకు ఆటంకంగా మారింది.ఈ ఘటనతో చార్మినార్ ప్రాంతంలో భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. రద్దీ ప్రదేశాల్లో విలువైన వస్తువులు తీసుకెళ్తున్నప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. అలాగే పహారా పెంచాలని, సీసీటీవీ వ్యవస్థను బలోపేతం చేయాలని స్థానికులు కోరుతున్నారు.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *