Breaking News

Revanth Shock to the Sarkar Allu Arjun Fans

రేవంత్ సర్కార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు షాక్

రేవంత్ సర్కార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు షాక్ – సోషల్ మీడియా పోస్టులపై కఠిన చర్యలు

తెలంగాణ ప్రభుత్వం సోషల్ మీడియా వేదికలపై అభ్యంతరకర పోస్టులపై కఠిన చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా, అల్లు అర్జున్ అరెస్టు అనంతరం సీఎం రేవంత్ రెడ్డి పై కొంతమంది అభిమానులు చేసిన అభ్యంతరకర పోస్టులపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసిన వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర

కాంగ్రెస్ నేతలు మరియు ఇతర రాజకీయ నాయకుల ఫిర్యాదుల ఆధారంగా, అల్లు అర్జున్ అభిమానులపై ఈ కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా, సీఎం రేవంత్ రెడ్డి పై వ్యక్తిగత దూషణలు చేయడం, నకిలీ అకౌంట్ల ద్వారా పోస్టులు పెడ్తున్న వారిపై పోలీసుల చర్యలు తీవ్రంగా మారాయి.

అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో అభిమానులు తమ ఆగ్రహాన్ని సోషల్ మీడియా వేదికలపై వ్యక్తం చేస్తూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై అసభ్య పదజాలాన్ని ఉపయోగించారు. ఈ కారణంగా, రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.

Tomorrow is a holiday
రేపు, ఎల్లుండి సెలవు

అయితే, ఇలాంటి పోస్టులు సమాజంలో కలహాలను రెచ్చగొడతాయని పేర్కొంది పోలీసు శాఖ. దీంతో, అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, సోషల్ మీడియా వేదికలను తమ భావాలను వ్యక్తం చేసేందుకు ఉపయోగించేందుకు చట్టం ఉల్లంఘించకుండా ఉండాలని అభిప్రాయపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *