Breaking News

Assembly Speaker Strong Warning for KTR Koushik Reddy

కేటీఆర్, కౌశిక్ రెడ్డికి అసెంబ్లీ స్పీకర్ స్ట్రాంగ్ వార్నింగ్

|| Assembly Speaker Strong Warning for KTR Koushik Reddy ||

హైదరాబాద్: డిసెంబర్ 18
తెలంగాణ అసెంబ్లీలో సహజంగా శాంత స్వభావంతో విధులు నిర్వహించే స్పీకర్ గడ్డం ప్రసాద్, బుధవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఆగ్రహంతో స్పందించారు.

ఆటో డ్రైవర్ల సమస్యలపై బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ప్రతిపాదించిన సందర్భంగా, సభలో అధికార మరియు ప్రతిపక్షాల మధ్య పరస్పర విమర్శలు నడిచాయి, దీంతో సభ ఉత్కంఠంగా మారింది.

గండ్రపల్లిలో మిస్టరీ డెత్స్.. భయంతో గ్రామం ఖాళీ!

ఈ సమయంలో, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, కౌశిక్ రెడ్డి, వివేకా నంద్ మరియు ఇతరులు ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. వీటి పట్ల శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయగా, స్పీకర్ ప్రసాద్ వీటిని రికార్డుల నుంచి తొలగించాలని ప్రకటించారు.

ముఖ్యంగా, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని స్పీకర్ ప్రసాద్ ప్రత్యేకంగా హెచ్చరించారు. సభ నిబంధనలను ఉల్లంఘించకుండా నడవాలని సూచించారు.

ఈ సందర్భంగా, స్పీకర్ గడ్డం ప్రసాద్, కేటీఆర్, కౌశిక్ రెడ్డికి గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. “మీరు ఎక్కడ కూర్చోకపోతే, నేను సభ నుంచి సస్పెండ్ చేస్తానని” స్పీకర్ హెచ్చరించారు.

హేట్ స్పీచ్ బిల్లు కాదు.. “ఫ్రీ స్పీచ్‌పై ఆంక్షల బిల్లు” – హరీష్ రావు విమర్శలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *