ఏప్రిల్ 16, నేటి తెలుగు పత్రిక: ప్రపంచవ్యాప్తంగా నెలకొంటున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక సందేశం ఇచ్చారు. యుద్ధాలు సమస్యలను పరిష్కరించలేవని, శాంతి చర్చల ద్వారానే దీర్ఘకాలిక పరిష్కారాలు సాధ్యమని ఆయన స్పష్టం చేశారు.భారత్కు పర్యటనకు వచ్చిన ఆస్ట్రియా ఛాన్సలర్ క్రిస్టియన్ స్టాకర్తో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ప్రధాని, ఉక్రెయిన్ మరియు మధ్యప్రాచ్య పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచం ప్రస్తుతం అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని, ఈ సమయంలో దేశాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు.సైనిక చర్యలు సమస్యలను మరింత క్లిష్టతరం చేస్తాయని, శాంతియుత సంభాషణల ద్వారానే మానవాళికి మేలు జరుగుతుందని మోదీ తెలిపారు. భారత్ ఎప్పుడూ శాంతి, స్థిరత్వానికి మద్దతు ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు.ఈ భేటీ ద్వారా భారత్–ఆస్ట్రియా సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని, వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతిక రంగాల్లో సహకారం పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచ శాంతి స్థాపనలో భారత్ పాత్ర మరింత కీలకమవుతుందని ఆయన పేర్కొన్నారు.
