ఏప్రిల్ 16, నేటి తెలుగు పత్రిక: తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేశ్ బాధ్యతలు చేపట్టడం స్వాగతార్హమని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. కష్టకాలంలో పార్టీని నిలబెట్టిన నాయకుడిగా లోకేశ్ తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నారని కొనియాడారు.ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తూ కార్యకర్తల్లో నమ్మకం పెంచారని చెప్పారు. ముఖ్యంగా యువగళం పాదయాత్ర ద్వారా ప్రజలతో నేరుగా మమేకమై పార్టీకి బలం చేకూర్చారని పేర్కొన్నారు.పార్టీ సభ్యత్వాన్ని విస్తరించడం, యువతను ఆకర్షించడం, కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించడం వంటి అంశాల్లో లోకేశ్ కీలక పాత్ర పోషించారని మంత్రి అభిప్రాయపడ్డారు. కార్యకర్తల సంక్షేమం కోసం తీసుకున్న చర్యలు కూడా ప్రశంసనీయమని అన్నారు.లోకేశ్ నాయకత్వంలో టీడీపీ మరింత బలపడుతుందని, భవిష్యత్తులో పార్టీకి కొత్త దిశ దొరుకుతుందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ విశ్వాసం వ్యక్తం చేశారు.
