ఏప్రిల్ 16, నేటి తెలుగు పత్రిక: మహారాష్ట్రలోని సేవాగ్రామ్ ఆశ్రమాన్ని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సందర్శించారు. స్వాతంత్ర్య సమరానికి చారిత్రక కేంద్రమైన ఈ ఆశ్రమంలో మహాత్మా గాంధీ నివసించిన నేపథ్యంలో ఈ పర్యటనకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది.సందర్శన సందర్భంగా గాంధీజీ, కస్తూర్బా గాంధీ స్మారకాలకు రాష్ట్రపతి నివాళులు అర్పించారు. అనంతరం బాపూ కూటీ, బా కూటీ, ఆది నివాస్, గాంధీజీ కార్యాలయాన్ని పరిశీలించి అక్కడి చరిత్రను అవగాహన చేసుకున్నారు.అలాగే ఆశ్రమంలో మొక్క నాటడం ద్వారా పర్యావరణ పరిరక్షణపై తన నిబద్ధతను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి పర్యటన దేశ స్వాతంత్ర్య చరిత్రను స్మరింపజేసేలా నిలిచింది.
