ఏప్రిల్ 16, నేటి తెలుగు పత్రిక: స్టాండప్ కామెడీ పేరుతో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నటుడు రామ్ చరణ్, నిహారిక వ్యక్తిగత జీవితాలపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో కమెడియన్ అనుదీప్ కటికాలపై ఫిర్యాదు నమోదు చేశారు. అఖిల భారత చిరంజీవి యువత ప్రతినిధులు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ను కలిసి ఫిర్యాదు అందజేశారు.ఫిర్యాదుపై స్పందించిన సజ్జనార్, వెంటనే దర్యాప్తు చేపట్టి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి నిజానిజాలు వెలికితీస్తామని చెప్పారు.అలాగే మరికొంత మంది స్టాండప్ కమెడియన్స్ కూడా మెగా ఫ్యామిలీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు రావడంతో ఈ అంశం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.వ్యక్తిగత దూషణలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, చట్టపరంగా ముందుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని చిరంజీవి యువత నాయకులు స్పష్టం చేశారు. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
