ఏప్రిల్ 17, నేటి తెలుగు పత్రిక: బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపాయి. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ ఉద్యమాన్ని అవమానించే విధంగా మాట్లాడడం అనుచితమని అన్నారు.ఈ అంశంపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించిన తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు, పార్లమెంట్లో ఆందోళనకు సిద్ధమయ్యారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు సీఎం రేవంత్ రెడ్డితో ఎంపీలు సమావేశమై తదుపరి కార్యాచరణపై చర్చించనున్నారు.అనంతరం ఉదయం 10:30 గంటలకు పార్లమెంట్ మకర ద్వారం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టనున్నారు. తేజస్వి సూర్య తన వ్యాఖ్యలకు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.అదేవిధంగా, ఆయన వ్యాఖ్యలను లోక్సభ రికార్డుల నుంచి తొలగించడంతో పాటు, సభ్యత్వాన్ని రద్దు చేయాలని కాంగ్రెస్ ఎంపీలు కోరుతున్నారు.ఈ వివాదం జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారగా, తెలంగాణ గౌరవాన్ని కించపరిచే వ్యాఖ్యలను సహించబోమని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేస్తున్నారు.
