ఏప్రిల్ 17, నేటి తెలుగు పత్రిక: చాట్రాయిలో ఇటీవల హత్యకు గురైన దివంగత అంబటి అనుదీప్ కుటుంబ సభ్యులను రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షుడు చందు జనార్దన్, జనసేన నాయకులు తుమ్మల జగన్, ముప్పిరిశెట్టి జగదీష్, తెలుగుదేశం పార్టీ నాయకులు కమ్ముల కొండలరావు, శ్రీరాములు సత్యనారాయణ కలిసి పరామర్శించారు. హత్య ఘటనపై ప్రత్యేక విచారణ అవసరంపై వారు చర్చించారు.




