ఏప్రిల్ 17, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి తన కోడలు ప్రీతిరెడ్డితో కలిసి ప్రధాని మోదీని కలవడం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. ప్రీతిరెడ్డికి ఎంపీ టికెట్ సాధన కోసమే ఈ భేటీ జరిగిందని ప్రచారం జరుగుతోంది. గతంలో ఆమె ఎంపీ కావాలనే అభిలాష వ్యక్తం చేయడం, బండి సంజయ్ను కలిసిన విషయం కూడా మళ్లీ చర్చకు వస్తోంది. ఇదే నేపథ్యంలో మల్లారెడ్డి భవిష్యత్ రాజకీయ అడుగులపై కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
