ఏప్రిల్ 17, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్ అమీర్పేట్లో నిర్వహించిన ఓ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ భారీ మోసం చేసినట్లు అధికారులు గుర్తించారు. ‘ప్లేస్మెంట్ హామీ’ అంటూ సుమారు 500 మంది నిరుద్యోగుల నుంచి ఒక్కొక్కరి నుంచి రూ.2 లక్షల వరకు వసూలు చేసి, రూ.10 కోట్లకు పైగా దోచుకున్నట్లు తేలింది. నకిలీ ప్రాజెక్టులు ఇచ్చి ట్రైనింగ్లో ఫెయిల్ అయ్యారనే పేరుతో డబ్బులు తిరిగి ఇవ్వకుండా మోసం చేసినట్లు విచారణలో వెల్లడైంది. ఈ ఘటనలో ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేశారు.
