ఏప్రిల్ 17, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును భారత్–పాకిస్తాన్ విభజనతో పోల్చిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల భావోద్వేగాలను దెబ్బతీసేలా ఉన్నాయని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయిఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేత హరీష్ రావు స్పందిస్తూ, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని అవమానించేలా మాట్లాడిన తేజస్వి సూర్య వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఏర్పాటు పూర్తిగా రాజ్యాంగబద్ధంగా జరిగిందని, దాన్ని ఇతర దేశాల విభజనలతో పోల్చడం తగదని ఆయన అన్నారు.ఈ అంశంపై సోషల్ మీడియాలో కూడా విస్తృతంగా చర్చ జరుగుతోంది. తెలంగాణలో రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం మరింత తీవ్రంగా మారుతోంది.
