Breaking News

లోక్‌సభ పునర్విభజనలో దక్షిణాదికి అదనపు ప్రాధాన్యం

ఏప్రిల్ 17, నేటి తెలుగు పత్రిక: లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనపై దేశవ్యాప్తంగా చర్చలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్రం దక్షిణాది రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు సంకేతాలు ఇచ్చింది. జనాభా నిష్పత్తికే పరిమితం కాకుండా అదనంగా సీట్లు పెంచే అవకాశముందని కేంద్ర వర్గాలు వెల్లడించాయి.ఈ క్రమంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు గణనీయంగా ఎంపీ సీట్లు పెరిగే అవకాశం ఉందని సమాచారం. దీనివల్ల దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం లోక్‌సభలో మరింత బలపడనుంది.దక్షిణాదికి అన్యాయం జరుగుతుందనే ప్రతిపక్షాల ఆరోపణలను కేంద్రం తిరస్కరిస్తోంది. అన్ని రాష్ట్రాలకు సమాన ప్రాధాన్యం కల్పించడమే లక్ష్యమని స్పష్టం చేస్తోంది.ఇప్పటికీ తుది నిర్ణయాలపై స్పష్టత రాకపోయినా, ఈ అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది.

సింగపూర్ పర్యటనలో ఏపీ మంత్రుల బృందం.. ఆధునిక పోర్టు వ్యవస్థలపై అధ్యయనం

పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్రం స్పష్టత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *