ఏప్రిల్ 17, నేటి తెలుగు పత్రిక: అనధికార లేఅవుట్ల క్రమబద్ధీకరణ కోసం దాఖలైన ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను త్వరితగతిన పరిశీలించి అర్హమైన వాటిని వెంటనే ఆమోదించాలని మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. ఈ విషయంపై మున్సిపల్ ముఖ్య కార్యదర్శి సురేశ్ సహా ఇతర అధికారులతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.పెండింగ్లో ఉన్న దరఖాస్తులను ఆలస్యం లేకుండా క్లియర్ చేయాలని స్పష్టం చేశారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల గడువు ఇప్పటికే పలుమార్లు పొడిగించబడిందని, ప్రస్తుత గడువు ఈ నెల 23తో ముగియనున్న నేపథ్యంలో ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని మంత్రి సూచించారు.
