ఏప్రిల్ 17, నేటి తెలుగు పత్రిక: అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలో జరిగిన శ్రీ శాంతామణి దేవి పండుగ వేడుకల్లో రాష్ట్ర శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు పాల్గొన్నారు. కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా వైసీపీ నేతల విమర్శలపై స్పందించిన ఆయన, పవిత్రమైన ఆలయంలో వారి ప్రస్తావన అవసరం లేదని వ్యాఖ్యానించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహకారంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం చేసే విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యానించారు.
