Breaking News

రాధాకృష్ణన్ జయంతి వేళ సీఎం రేవంత్ నివాళులు

ఏప్రిల్ 17, నేటి తెలుగు పత్రిక: మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలోని అధికారిక నివాసంలో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా రాధాకృష్ణన్ దేశానికి చేసిన విశిష్ట సేవలను ఆయన గుర్తు చేశారు. భారతదేశపు తొలి ఉపరాష్ట్రపతిగా సేవలందించిన రాధాకృష్ణన్ గొప్ప తత్వవేత్త, విద్యావేత్తగా చిరస్థాయిగా నిలిచారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్, వేమ్ నరేందర్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కాళేశ్వరం పునరుద్ధరణపై దృష్టి.. దురుద్దేశం లేదన్న మంత్రి

బాయిల్డ్ రైస్ కొనుగోళ్లపై కేంద్రానికి తెలంగాణ విజ్ఞప్తి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *