Breaking News

ఢిల్లీలో ఏపీ మహిళా ప్రజాప్రతినిధులతో ఆత్మీయ సమావేశం..!

విజయవాడ ,ఏప్రిల్ 17 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: మహిళలను అన్ని రంగాల్లో ఆర్థికంగా, సామాజికంగా బలోపేతం చేయడమే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని విజయవాడ ఎంపీ కేశినేని శివ నాథ్ (చిన్ని) స్పష్టం చేశా రు. శుక్రవారం దేశ రాజధాని ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్‌ కు చెందిన పార్టీ మహిళా ప్రజాప్రతినిధులతో ఎంపీ కేశినేని చిన్ని ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ, ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌ల దూరదృష్టితో కూడిన నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం మహిళా సాధి కారతకు అత్యంత ప్రాధాన్యతనిస్తోందని వివరించారు. మహిళలు రాజకీయంగా ఎదిగేందుకు తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ వేదికగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షల మేరకు ‘నారీ శక్తి’ని మరిం త బలోపేతం చేయడంలో తమ వంతు కృషి చేస్తామని కేశినేని చిన్ని పునరుద్ఘాటించారు. దేశ నిర్మాణంలో మహిళల పాత్రను గుర్తించి, వారిని అభివృద్ధి పథంలో నడిపించేందుకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ సమావేశం లో ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చిన పలువురు మహిళా ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇతర ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

అపహాస్యం నుంచి అద్భుతమైన నాయకత్వం

మహిళా రిజర్వేషన్ బిల్లుకు టీడీపీ మద్దతు పునరుద్ఘాటించిన చంద్రబాబు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *