ఏప్రిల్ 17, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ రాష్ట్ర విభజనపై బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నేతలు తప్పుగా అర్థం చేసుకుంటున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ విధానాల వల్ల పలువురు యువకులు ఆత్మబలిదానాలు చేసుకున్నారని తేజస్వి సూర్య ప్రస్తావించారని ఆయన తెలిపారు.2009లో తెలంగాణ ఏర్పాటు విషయంలో కాంగ్రెస్ ముందుకు వచ్చి తర్వాత వెనక్కి తగ్గిందని, అదే అంశాన్ని తేజస్వి సూర్య ప్రస్తావించారని పేర్కొన్నారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి గతంలో తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా వ్యవహరించారని విమర్శించారు.కరీంనగర్లో జరిగిన కార్యక్రమాలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్పై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్ర విభజనకు బీజేపీ మద్దతు ఇచ్చిందని, మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ అడ్డుకుంటోందని ఆరోపించారు.అదే సమయంలో బీఆర్ఎస్ అవినీతి అంశంపై సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదని బండి సంజయ్ ప్రశ్నించారు.
