ఏప్రిల్ 17, నేటి తెలుగు పత్రిక: బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట్ర డీజీపీకి లేఖ రాశారు. తెలంగాణ విభజనపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ ఆయన ఈ విజ్ఞప్తి చేశారు.ఈ విషయంపై స్పందించిన డీజీపీ శివధర్ రెడ్డి, చట్టసభల్లో చేసిన వ్యాఖ్యలపై పోలీసులకు చర్యలు తీసుకునే అధికారం లేదని స్పష్టం చేశారు. దీంతో ఈ అంశంపై తదుపరి పరిణామాలపై ఆసక్తి నెలకొంది.
