ఏప్రిల్ 17, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్ ఉప్పల్ మెట్రో స్టేషన్కు బాంబు బెదిరింపు కాల్ రావడంతో ప్రయాణికుల్లో ఆందోళన నెలకొంది. గుర్తు తెలియని వ్యక్తి నుంచి వచ్చిన ఈ సమాచారం వెంటనే పోలీసులను అప్రమత్తం చేసింది.బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సిబ్బంది స్టేషన్కు చేరుకుని ప్రతి మూలను తనిఖీ చేశారు. భద్రతా చర్యలను కట్టుదిట్టం చేస్తూ ప్రయాణికులను అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, బెదిరింపు కాల్ చేసిన వ్యక్తిని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. పూర్తి వివరాలు ఇంకా వెల్లడికావాల్సి ఉంది.
