ఏప్రిల్ 18, నేటి తెలుగు పత్రిక: సీనియర్ పాత్రికేయులు అడపా సాయి అనారోగ్యానికి గురై చికిత్స అనంతరం చల్లపల్లిలోని తమ నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షుడు చందు జనార్దన్ ఆయనను పరామర్శించారు. అడపా సాయి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పెరవలి రవి, ముప్పిరిశెట్టి జగదీశ్, ఆకుల సుధీర్, నడకుదురు లీలా బ్రహ్మం, భోగాది చిన్నారి, మెండు వీరబాబు, ఆకుల రాఘవ, పాండాలనేని ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.




