Breaking News

వివాహానికి చంద్రబాబును ఆహ్వానించిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్

ఏప్రిల్ 18, నేటి తెలుగు పత్రిక: టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన పెళ్లి వేడుకకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఆహ్వానించారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన సీఎంను కలసి ఆహ్వాన పత్రిక అందజేశారు.ఈ నెల 29న తిరుమలలో సాయి శ్రీనివాస్ వివాహం జరగనుండగా, మే 1న హైదరాబాద్‌లో రిసెప్షన్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్‌ను కూడా కలిసి వివాహానికి ఆహ్వానించారు.సాయి శ్రీనివాస్‌కు శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు, వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో నిండాలని ఆశీర్వదించారు. ఈ వివాహానికి సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యే అవకాశముంది.

పుకార్లపై త్రిష పరోక్ష స్పందన?

చిత్ర పరిశ్రమ అభివృద్ధికి పూర్తి సహకారం: మంత్రి దుర్గేశ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *