పుంజుల కోసం పందెపురాయుళ్లు వేట
సంక్రాంతి సంబరాల్లో భాగంగా కోడిపందేలకు ఆసక్తి ఉన్న పందెపురాయుళ్లు మేలు జాతి పుంజుల కోసం వెతుకులు ప్రారంభించారు. పందెపు కోళ్ల పెంపకం వృత్తిదారులు, కొనుగోలుదారులను ఆకర్షించేలా పుంజులను ప్రత్యేక శిక్షణతో తయారు చేస్తున్నారు.
ఏలూరు, ఒంగోలు, తాడేపల్లిగూడెం తదితర ప్రాంతాలకు వెళ్లి మంచి జాతి పుంజులను కొనేందుకు పందెపురాయుళ్లు లక్షల్లో ఖర్చు చేస్తున్నారు. కొందరు ఔత్సాహికులు విదేశీ జాతి పుంజులను కూడా కొనుగోలు చేసి పందేలకు సిద్ధం చేస్తున్నారు.
పల్లెటూర్లలో సాధారణ పుంజుల ధరలు ₹10,000 నుంచి ₹20,000 మధ్య ఉండగా, ప్రత్యేక శిక్షణ పొందిన పందెపు కోళ్ల ధర ఒక్కోటి లక్ష వరకు ఉంటోంది. సంక్రాంతి పండుగకు కోడిపందేలు గ్రామాల్లో సందడి తేవడం అనేది సాంప్రదాయంగా మారింది.
