వైకుంఠద్వార దర్శన టికెట్ల కోటా విడుదలకు తేదీ నిర్ణయం
తిరుమల:
జనవరి 10 నుంచి 19వ తేదీ వరకు తిరుమలలో జరగనున్న వైకుంఠద్వార దర్శనాల కోసం రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను డిసెంబర్ 24న విడుదల చేయనున్నట్టు టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. అదనపు ఈవో వెంకయ్య చౌదరితో కలిసి వైకుంఠద్వార దర్శనాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన అనంతరం ఆయన ఈ వివరాలను వెల్లడించారు.
వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులకు సౌకర్యవంతమైన దర్శనాన్ని కల్పించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. టికెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయని, భక్తులు ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.
