Breaking News

Vijay sold the Malaya assets and deposited it to 14 thousand crores banks

విజయ్ మాల్యా ఆస్తులను అమ్మి 14 వేల కోట్లు బ్యాంకులకు జమ

విజయ్ మాల్యా ఆస్తులను అమ్మి 14 వేల కోట్లు బ్యాంకులకు జమ – కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన

లోక్ సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. ఆమె మాట్లాడుతూ, బ్యాంకు రుణాలను ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరస్థుల నుంచి ఈ ఏడాది ₹22,280 కోట్లు రాబట్టినట్లు వెల్లడించారు.

ఆర్ధిక నేరస్థులలో పరారీలో ఉన్న వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు చెందిన దేశంలో ఉన్న ఆస్తులను వేలం వేసి ₹14,000 కోట్లు బ్యాంకుల్లో జమ చేసినట్లు మంత్రి వివరించారు. అలాగే, గుజరాత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ నుండి ₹1,000 కోట్లు వసూలు చేసినట్లు తెలిపారు.

కేంద్రం శుక్రవారం విడుదల చేసిన కొత్త LPG అప్‌డేట్: కొరత లేదు, సరఫరా సజావుగా

మిగతా ఎగవేతదారుల నుంచి ₹7,000 కోట్లు వసూలు చేసి, మొత్తం ₹22,280 కోట్లు వివిధ బ్యాంకులకు జమ చేశామని మంత్రి వెల్లడించారు. ఈ మేరకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరియు బ్యాంకులు సంయుక్తంగా ముంబైలోని స్పెషల్ కోర్టును ఆశ్రయించాయి.

అటు, మరొక వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీకి చెందిన ₹2,566 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసిందని, ఈ ఆస్తులను కూడా స్పెషల్ కోర్టు అనుమతితో వేలం వేసే చర్యలు చేపట్టినట్లు మంత్రి తెలిపారు.

పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి తీసుకున్న ₹13,000 కోట్ల పైగా రుణాలను చోక్సీ తిరిగి చెల్లించకపోవడంతో, ఈడీ జప్తు చేసిన ఆస్తులను స్పెషల్ కోర్టు ఆదేశాలతో విక్రయించి, బ్యాంకులకు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు.

ముత్తాత, నానమ్మలే వామపక్షాలను ఏమి చేయలేకపోయారు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *