ఏప్రిల్ 19, నేటి తెలుగు పత్రిక: రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పలు కీలక అంశాలపై చర్చించారు. లోక్భవన్లో జరిగిన ఈ సమావేశంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి కూడా పాల్గొన్నారు.ఈ భేటీలో ముఖ్యంగా విద్యా రంగానికి సంబంధించిన అంశాలు ప్రాధాన్యత పొందాయి. జూన్ 12న ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న ప్రత్యేక అవగాహన కార్యక్రమంపై సీఎం గవర్నర్తో చర్చించారు. ఈ కార్యక్రమాన్ని గవర్నర్ ఆధ్వర్యంలో నిర్వహించే విషయంపై కూడా స్పష్టత ఇచ్చారు.విద్యా సంస్థల్లో మాదక ద్రవ్యాల వినియోగాన్ని నియంత్రించాల్సిన అవసరాన్ని గవర్నర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. విద్యార్థుల్లో అవగాహన పెంచే దిశగా విస్తృత కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. అడ్మిషన్ సమయంలోనే విద్యార్థుల నుంచి మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటామని ప్రమాణపత్రాలు తీసుకోవడం వంటి చర్యలు తీసుకోవాలని సూచించారు.గవర్నర్ సూచనలను సానుకూలంగా స్వీకరించిన ముఖ్యమంత్రి.. వాటిని అమలు చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. విద్యార్థులను మాదక ద్రవ్యాల నుంచి దూరంగా ఉంచడం కోసం అవసరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
