Breaking News

జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచాలి.. మాల మహానాడు డిమాండ్‌

విజయవాడ. ఏప్రిల్ 19 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ల శాతాన్ని పెంచాలని మాల మహా నాడు జాతీయ అధ్యక్షు లు గోళ్ళ అరుణ్ కుమార్, మల్లెల వెంకటరావు, డిమాండ్‌ చేశారు. ఆదివా రం స్థానిక ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈసమా వేశంలోవారుమాట్లాడుతూ అనేక ఏళ్లుగా ఈ డిమాండ్‌ పెండింగ్‌లో ఉన్నప్పటి కీ, పార్లమెంటు లో దీనిపై కనీసం చర్చ జరపకపోవడం పట్ల వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాసేలా ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో కుట్రలు జరుగుతున్నాయని నేత లు ఆరోపించారు. రిజర్వే షన్ల పెంపు విషయంలో ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించు కోవాలని వారు కోరారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని సంఘాలను ఏకతాటిపైకి తీసుకువచ్చి, గ్రామ గ్రామాన ఉద్యమాలను ఉధృతం చేస్తామని నేత లు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మల్లెల వెంకటరావు, కోట్ల గంగా ధర్, గోళ్ళ అరుణ్ కుమా ర్, సిహెచ్ అశోక్ రత్న, గోదా జాన్ పాల్, బండి కనక వరప్రసాద్, దండేల కృష్ణ, పొంగులేటి జయ రాజ్, కొత్తపల్లి ఏడుకొండ లు, తదితరులు పాల్గొన్నారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

సీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనిత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *