విజయవాడ. ఏప్రిల్ 19 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జన్మదిన వేడుకల సందర్భంగా ఆయన పరిపాల నా దక్షత, జీవిత విశేషా లతో కూడిన, ధర్మచక్రం, సినిమా, డాక్యుమెంటరీని రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శించనున్నట్లు దర్శక నిర్మాత పసుపులేటివెంకటరమణతెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం గాంధీనగర్ లోని స్థానిక ప్రెస్క్లబ్లో
ఈ వేడుకల వివరాలతో కూడిన పోస్టర్ను ఆవిష్క రించారు. ఈ మేరకు నిర్వాహకులు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు, నిస్వార్థంగా అందిస్తు న్న సేవలను, ఆయన పాలన లోని విశిష్టతలను ప్రజలకు వివరించడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ మని వెల్లడించారు. ముఖ్యమంత్రిపై జరుగు తున్న అసత్య ప్రచారాల ను తిప్పికొట్టి, వాస్తవాల ను ప్రజల ముందు ఉంచే లా ఈ చిత్రాలను రూపొం దించినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల లో, ఈ ప్రదర్శనలు ఉంటాయని వారు వివారించారు.
