Breaking News

బహుజన ఉద్యోగుల హక్కుల పరిరక్షణే ధ్యేయం.. ఏపీ బహుజన ఉద్యోగ సంఘం

విజయవాడ. ఏప్రిల్ 19 సెంట్రల్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: బహుజన ఉద్యోగుల హక్కుల పరిరక్షణే ధ్యేయంగా,ఆంధ్రప్రదేశ్ బహుజన ఉద్యోగ సంఘం, ఏర్పడిందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షు డు కె. దినకరమూర్తి, ప్రధాన కార్యదర్శి లేళ్ల అంజయ్య, వెల్లడించారు. ఈ సందర్భంగా ఆదివా రం గాంధీనగర్‌ లోని స్థాని క ప్రెస్ క్లబ్‌లో మీడియా సమావేశం నిర్వహించా రు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ 2011 నుంచి బహుజన విద్యుత్ ఉద్యోగుల సంఘంగా కొనసాగుతు న్న తమ సంస్థను, ఇప్పు డు మరిన్ని విభాగాలను కలుపుకొని రాష్ట్ర స్థాయి సంఘంగా విస్తరించినట్లు వారు తెలిపారు. బహు జన ఉద్యోగుల సర్వీసు అంశాలు, బదిలీలు, పదో న్నతుల్లో ఎదురయ్యే సమస్యలను పరిష్కరిం చడమే సంఘం ప్రధాన లక్ష్యమని వారు స్పష్టం చేశారు. ప్రభుత్వ, ప్రైవే టు సంస్థల్లోని ఉద్యోగుల సమస్యలతో పాటు, సామాన్య ప్రజలకు ఎదు రయ్యే ఇబ్బందులను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నా రు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ సంఘం శాఖలను త్వరలోనే విస్తృతం చేయనున్నట్లు నాయకులు వెల్లడించారు ఈ కార్యక్రమం లో సంఘం వర్కింగ్ ప్రెసిడెం ట్ నక్కా కాంతారావు, ఉపాధ్యక్షులు ఎస్. రమ ణ, అసిస్టెంట్ జనరల్ సెక్రెటరీ సుంద ర్రావు, జాయింట్ సెక్రటరీ నాగా ర్జున, ట్రెజరర్ పి. చంద్ర శేఖర కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

సీఐ శంకర్‌రావుపై ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు: హోంమంత్రి అనిత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *