ఏప్రిల్ 20, నేటి తెలుగు పత్రిక: బెంగాల్లో ఎన్నికల వేడి పెరుగుతున్న వేళ మహిళా రిజర్వేషన్ బిల్లు రాజకీయ వాదోపవాదాలకు దారితీసింది. ఈ నేపథ్యంలో బిష్ణుపుర్లో జరిగిన ఎన్నికల సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపక్ష పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు.పార్లమెంట్, రాష్ట్ర అసెంబ్లీలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలనే లక్ష్యంతో వచ్చిన బిల్లుకు అడ్డంకులు సృష్టించారని ఆయన ఆరోపించారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్తో కలిసి పనిచేస్తూ మహిళలకు న్యాయం జరగకుండా అడ్డుకట్ట వేసిందని విమర్శించారు.మహిళల రాజకీయ ప్రాతినిధ్యాన్ని పెంచే ఈ చట్టాన్ని వ్యతిరేకించడం ప్రజలు గమనిస్తున్నారని మోదీ అన్నారు. రాబోయే ఎన్నికల్లో మహిళా ఓటర్లు సరైన తీర్పు ఇస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.మహిళల భద్రత, అభివృద్ధి, ఆర్థిక స్వావలంబనపై దృష్టి పెట్టడం బీజేపీ లక్ష్యమని తెలిపారు. మహిళలు నిర్ణయాత్మక స్థానాల్లో ఉండాలని తమ ప్రభుత్వం కోరుకుంటుందని పేర్కొన్నారు.టీఎంసీపై విమర్శలు గుప్పించిన మోదీ, బుజ్జగింపు రాజకీయాలతో సమాజంలో విభేదాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని వ్యాఖ్యానించారు.అలాగే గిరిజన వర్గాల సమస్యలను పట్టించుకోవడం లేదని టీఎంసీపై విమర్శించారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు తగిన గౌరవం ఇవ్వలేదని ఆరోపిస్తూ, గిరిజనుల అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని మోదీ పేర్కొన్నారు.
