Breaking News

సాదా బైనామా భూముల రిజిస్ట్రేషన్‌కు ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం

ఏప్రిల్ 20, నేటి తెలుగు పత్రిక: తెలంగాణలో సాదా బైనామా పత్రాలతో ఉన్న వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ నేటి నుంచి ప్రారంభమైంది. రైతులు తమ దరఖాస్తుతో పాటు స్వీయ అఫిడవిట్ (Self Affidavit) సమర్పించడం తప్పనిసరి అని ప్రభుత్వం స్పష్టం చేసింది.ఇంతకుముందు ఈ సమస్యపై సుమారు 9 లక్షల దరఖాస్తులు వచ్చినప్పటికీ, వివిధ సాంకేతిక మరియు చట్టపరమైన చిక్కుల కారణంగా కేవలం 60 వేల దరఖాస్తులు మాత్రమే పరిష్కారమయ్యాయి. హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో మిగిలిన కేసులను వేగంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.ఈ ప్రక్రియలో భాగంగా డ్రై ల్యాండ్‌కు 5 ఎకరాల వరకు, వెట్ ల్యాండ్‌కు 2.5 ఎకరాల వరకు రిజిస్ట్రేషన్‌ను ఉచితంగా చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీనికి మించిన భూములపై మాత్రం మార్కెట్ విలువ ప్రకారం రిజిస్ట్రేషన్ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.ఈ కొత్త విధానం ద్వారా సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న సాదా బైనామా భూముల సమస్యలకు త్వరితగతిన పరిష్కారం లభిస్తుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.

తెలంగాణను ప్రపంచానికి ద్వారంగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *