Breaking News

ఢిల్లీకి హరీశ్‌రావు.. జగిత్యాల సభకు దూరం

ఏప్రిల్ 20, నేటి తెలుగు పత్రిక: తెలంగాణలో రాజకీయంగా కీలకమైన సమయంలో బీఆర్‌ఎస్‌ సీనియర్ నేత హరీశ్‌రావు జగిత్యాల బహిరంగ సభకు గైర్హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది. నేడు నిర్వహించిన బీఆర్‌ఎస్‌ సభకు ఆయన హాజరు కాలేకపోయారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన కేసు తెలంగాణ హైకోర్టు లో తుది దశకు చేరడంతో, న్యాయ సలహాల కోసం ఆయన ఢిల్లీకి వెళ్లినట్లు సమాచారం. కేసు కీలక దశలో ఉండటంతో న్యాయపరమైన అంశాలకు ప్రాధాన్యం ఇచ్చారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా, పార్టీ అధినేత కేసీఆర్ సూచనల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నారని బీఆర్‌ఎస్‌ నాయకులు వెల్లడించారు. రాజకీయ కార్యక్రమాల కంటే ప్రస్తుతం న్యాయపరమైన అంశాలే ముఖ్యమని భావించి హరీశ్‌రావు ఈ సమావేశానికి దూరంగా ఉన్నట్లు పేర్కొన్నారు.అయితే కీలక సమయంలో సభకు గైర్హాజరు కావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. దీనిపై వివిధ రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది.

కేసీఆర్‌పై పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ విమర్శలు

హరీశ్‌రావుపై మంత్రి తుమ్మల తీవ్ర విమర్శలు.. ‘అధికారంలోకి రారు’ వ్యాఖ్యలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *