ఏప్రిల్ 20, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన పుట్టినరోజును సతీమణి భువనేశ్వరితో కలిసి సాదాసీదాగా జరుపుకున్నారు. ఇద్దరూ కలిసి కేక్ కట్ చేస్తూ బర్త్డే సెలబ్రేషన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆ ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్న చంద్రబాబు, “నా జీవిత ప్రయాణంలో ప్రతి అడుగులోనూ నాతో పాటు నిలిచిన నా భార్యతో కలిసి మరో ఏడాది పూర్తి చేసుకోవడం ఆనందంగా ఉంది” అని పేర్కొన్నారు.ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్గా మారగా, అభిమానులు ‘అన్యోన్య దంపతులు’ అంటూ ప్రశంసలు కురిపిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
