Breaking News

కోయంబత్తూరులో చంద్రబాబు ప్రచారం.. ఎన్డీఏ అభ్యర్థులకు మద్దతు పిలుపు

ఏప్రిల్ 20, నేటి తెలుగు పత్రిక: తమిళనాడులో ఎన్నికల ప్రచారం భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోయంబత్తూరులో పర్యటించారు. ఎన్డీఏ అభ్యర్థులకు మద్దతుగా ఆయన విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా వ్యాపారవేత్తలు, నిపుణులతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన చంద్రబాబు, అభివృద్ధి అంశాలపై చర్చించారు. రాష్ట్రాల మధ్య నీటి వనరుల వినియోగం, నదుల అనుసంధానం అవసరాన్ని వివరించారు. గోదావరి నీళ్ల వినియోగంపై కూడా ప్రస్తావించారు.ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగితే ‘డబుల్ ఇంజిన్ సర్కార్’ ద్వారా వేగవంతమైన అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రజలు ఎన్డీఏ అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు.అలాగే, డీలిమిటేషన్ అంశంలో ఇండి కూటమి అడ్డంకులు సృష్టించిందని చంద్రబాబు విమర్శించారు. మహిళల హక్కుల విషయంలో కూడా ఇండి కూటమి అన్యాయం చేసిందని ఆరోపించారు.మొత్తానికి, కోయంబత్తూరు ప్రచారంలో చంద్రబాబు వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

విజయ్‌కు మద్రాసు హైకోర్టు నోటీసులు

తమిళనాడులో రిమోట్ కంట్రోల్ ప్రభుత్వం వద్దు: రాహుల్ గాంధీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *