ఏప్రిల్ 20, నేటి తెలుగు పత్రిక: తమిళనాడు రాజకీయాలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఘాటుగా స్పందించారు. బీజేపీ రాష్ట్రంలో కీలుబొమ్మ ముఖ్యమంత్రిని ఏర్పాటు చేసి, రిమోట్ కంట్రోల్ ప్రభుత్వం నడపాలని చూస్తోందని ఆయన ఆరోపించారు.ఈ తరహా పాలనను భారత్ కూటమి ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించదని స్పష్టం చేశారు. తమిళనాడు ప్రజలు తమ గౌరవం, ప్రత్యేక గుర్తింపును కాపాడుకునే విధంగా ఓటు వేస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.రాష్ట్ర స్వాభిమానాన్ని కాపాడటం తమ బాధ్యతగా భావిస్తున్నామని, ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీసే ప్రయత్నాలను ఎదుర్కొంటామని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
