Breaking News

ఎన్టీఆర్ భవన్‌లో వైభవంగా సీఎం జన్మదిన వేడుకలు

విజయవాడ. ఏప్రిల్ 20 ఈస్ట్ నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకొని విజ యవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) కార్యా లయం ఎన్టీఆర్ భవన్‌లో సోమవారం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని మార్గదర్శకత్వంలో ఏర్పాటు చేసిన ఈ కార్య క్రమం కార్యకర్తల కోలాహలంతో పండుగలాసాగింది ఈ వేడుకలకు మాజీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు, పార్టీ సీనియర్ నాయకులు బొప్పాన భవ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఎంపీ కేశినేని చిన్ని పర్యవేక్షణ లో ఏర్పాటు చేసిన భారీ కేక్‌ను వారు కట్ చేసి, చంద్రబాబు నాయుడుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సంద ర్భంగా పరుచూరి అశోక్ బాబు, బొప్పాన భవకు మార్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు విజనరీ నాయకత్వం రాష్ట్రానికి గర్వకారణమ ని కొనియాడారు. ఎంపీ కేశినేని చిన్ని సారథ్యంలో విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి తామంతా కట్టుబడి ఉ న్నామని స్పష్టం చేశారు.ఎన్టీఆర్ భవన్ వేదికగా జరుగుతున్న ఇటువంటి కార్యక్రమాలు కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపు తున్నాయని పేర్కొన్నారు ఎన్టీఆర్ భవన్ ప్రాంగణం అంతా పార్టీ జెండాలు, పసుపు తోరణాలతో కళ కళలాడింది. భారీ సంఖ్య లో తరలివచ్చిన తెలుగు తమ్ముళ్లు, అభిమానులు ‘జై బాబు’ అంటూ చేసిన నినాదాలతో పరిసరాలు మారుమోగాయి. కార్యక్ర మం అనంతరం కార్యకర్త లకు, ప్రజలకు మిఠాయి లు, కేక్ లు పంపిణీ చేశారు.

జగన్‌పై నిమ్మల తీవ్ర విమర్శలు.. ‘క్రిమినల్ రాజకీయాలు’ అంటూ ధ్వజం

స్లీపర్ బస్సులపై నిషేధానికి సిఫార్సు.. ప్రభుత్వానికి కీలక నివేదిక

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *