ఏప్రిల్ 20, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్లో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని నార్వే రాయబారి మే-ఎలిన్ స్టెనెర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ మరియు నార్వే మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేసే అంశాలపై చర్చించారు.భేటీలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, హైదరాబాద్ రీజినల్ పాస్పోర్ట్ అధికారిణి స్నేహజ జొన్నలగడ్డతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వాణిజ్యం, అభివృద్ధి రంగాల్లో పరస్పర భాగస్వామ్యాన్ని విస్తరించేందుకు ఈ సమావేశం ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు.
