Breaking News

జగన్‌పై నిమ్మల తీవ్ర విమర్శలు.. ‘క్రిమినల్ రాజకీయాలు’ అంటూ ధ్వజం

అమరావతి, ఏప్రిల్ 20, నేటి తెలుగు పత్రిక: వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ జగన్ రాజకీయాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.జగన్ వ్యవహారం “పాము తన గుడ్లను తానే తినడం లాంటిదని” విమర్శించిన మంత్రి, అధికార దాహం కోసం ఎవ్వరినీ వదలరని ఎద్దేవా చేశారు. ఆయన రాజకీయాలు క్రిమినల్ స్వభావంతో ఉన్నాయని, ఈ విషయాన్ని వైసీపీ కార్యకర్తలు గమనించాలని సూచించారు.పెద్ద దస్తగిరి హత్య, ఇతర ఘటనలను ప్రస్తావిస్తూ జగన్ నైజం బయటపడుతోందని ఆరోపించారు. పార్టీకి చెందిన వ్యక్తులపై జరిగిన ఘటనలు కూడా ఆయన స్వార్థ రాజకీయాలకు నిదర్శనమని అన్నారు.రాష్ట్రంలో హింసాత్మక రాజకీయాలకు స్థానం లేదని స్పష్టం చేసిన మంత్రి, ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. వైసీపీకి రాష్ట్రంలో స్థానం లేకుండా చేయాలని ప్రజలను ఆయన పిలుపునిచ్చారు.

కృష్ణాజిల్లా డిపిఓ కార్యాలయాన్ని అసత్య ఆరోపణలతో అల్లరి చేస్తున్న వారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని కార్యదర్శులు డిమాండ్.

మహిళా రిజర్వేషన్‌పై చంద్రబాబు విమర్శలు.. ఇండి కూటమిపై ఆగ్రహం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *