హైదరాబాద్, ఏప్రిల్ 20, నేటి తెలుగు పత్రిక: యాంకర్ అనసూయపై సోషల్ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. దారెపల్లి చంటి అనే నిందితుడు ఇన్స్టాగ్రామ్ ద్వారా అభ్యంతరకర పోస్టులు పెడుతూ ఆమె ప్రతిష్ఠను దెబ్బతీయడానికి ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు.ఈ ఘటనపై అనసూయ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బీఎన్ఎస్, ఐటీ చట్టాల కింద కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.సోషల్ మీడియాలో అసభ్యకర, దూషణాత్మక పోస్టులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
